<p>అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్లో సంజూ శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోరుకు పునాది వేశారు. ఈ క్రమంలో ఆయన ఐదు అద్భుతమైన రికార్డులను సృష్టించారు.</p>
